Tuesday, July 25, 2017



Health is wealth 11 - ఆరోగ్యమే మహాభాగ్యం 11
                                                     Dated : 25-07-2017
                                                                            updated:  27-07-2017

ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే !





కరివేపాకును మనం కూరల్లో ఎక్కువగా వేస్తుంటాం. దీంతో కూరలకు మంచి రుచి, వాసన వస్తాయి. అయితే కూరల్లో లేదా ఇతర ఏ ఆహార పదార్థాల్లో ఉన్న కరివేపాకును అయినా చాలా మంది తినరు. పక్కన పెట్టేస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు చదివితే కరివేపాకును వదిలి పెట్టకుండా తింటారు. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. నిత్యం ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే మధుమేహం కొద్ది రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తుంది. టైప్ 1, 2 ఎలాంటి డయాబెటిస్ అయినా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. 

2. రక్తహీనత సమస్య ఉన్నవారికి కరివేపాకులు చక్కని మెడిసిన్ అని చెప్పవచ్చు. నిత్యం వీటిని తింటుంటే రక్తం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు వృద్ధి అవుతాయి. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. 

3. నాన్‌వెజ్ ఎక్కువగా తినడం, మద్యం సేవించే వారిలో సహజంగా లివర్ వ్యాధులు వస్తాయి. అయితే నిత్యం కరివేపాకు ఆకులను తింటుంటే లివర్ శుభ్రమవుతుంది. లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. 

4. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. 



5. జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. 

6. డయేరియా సమస్య తొలగిపోతుంది. నీళ్ల విరేచనాలు ఆగుతాయి. 


7. కీమోథెరపీ చేయించుకున్నాక క్యాన్సర్ పేషెంట్లకు కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 


8. దగ్గు, జలుబు, జ్వరం రావు. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. 



9. వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి. నల్లగా మారుతాయి. చుండ్రు పోతుంది. 



10. నేత్ర సమస్యలు పోతాయి. దృష్టి బాగా పెరుగుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. 



11. గాయాలు, పుండ్లు అయిన వారు కరివేపాకును రెగ్యులర్‌గా తింటే అవి త్వరగా తగ్గుముఖం పడతాయి.




Gas problem (Remedy)  - గ్యాస్ సమస్య నివారణ 

జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరలు వాపునకు గురైనప్పుడు, పలు రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, ఒత్తిడి, ఆందోళనకు ఎక్కువగా లోనవడం వల్ల, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మద్యం సేవించడం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలా వచ్చే గ్యాస్ సమస్యను పలు సింపుల్ టిప్స్ పాటించడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 



1. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే గ్యాస్ సమస్య ఉండదు. 



2. పుదీనా, చామంతి, రాస్ప్‌బెర్రీ రుచులలో ఉండే టీని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 



3. పసుపు ఆకులను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య ఇట్టే పోతుంది. 



4. రోజూ ఉదయాన్నే పరగడుపున‌ 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగినా గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. 



5. గ్యాస్ సమస్యకు అల్లం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. లేదంటే 1 టీస్పూన్ అల్లం రసం తాగినా చాలు. సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 



6. ఆలుగడ్డలను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. దీన్ని రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య రాదు. 



7. భోజనానికి ముందు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగాలి. లేదంటే వాటి రసం తాగినా చాలు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 



8. దాల్చినచెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగాలి. భోజనానికి ముందు ఈ నీటిని తాగితే గ్యాస్ రాదు. 



9. భోజనం చేశాక 2, 3 యాలకుల్ని అలాగే నమిలి తిన్నా గ్యాస్ రాదు. 



10. రోజూ ఏదో ఒక సమయంలో కొబ్బరినీళ్లను తాగుతుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది. 



11. ఒక గ్లాస్ వేడి నీటిలో 3 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. 



12. రోజూ మజ్జిగలో నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకుని తాగినా గ్యాస్ సమస్య బాధించదు. 



13. కొద్దిగా కొత్తిమీర తీసుకుని దాన్నుంచి రసం తీసి ఆ రసం తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది. కొత్తిమీరను నేరుగా తిన్నా సరే ఈ సమస్య రాదు. 



14. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో నల్ల మిరియాల పొడి వేసుకుని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. 



15. ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీస్పూన్ ఇంగువను వేసి కలిపి తాగితే గ్యాస్ బారి నుంచి బయట పడవచ్చు. 



16. భోజనం చేశాక సోంపు, లవంగాలు, వాము నమిలి మింగాలి. దీని వల్ల కూడా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. 



17. రోజూ వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే గ్యాస్ సమస్య రాదు. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా అవుతుంది.




పాల‌లో చిటికెడు ప‌సుపు క‌లుపుకుని తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

ప‌సుపును మ‌నం రోజూ వంటల్లో ఉపయోగిస్తాం. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రంగు, రుచి, వాస‌న వ‌స్తాయి. ఇక పాలు. పాల‌తో మ‌న‌కు సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. చాలా మంది రోజూ పాల‌ను తాగుతారు. అయితే నిత్యం రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు క‌లుపుకుని తాగితే ఏమ‌వుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. 


1. గోరువెచ్చ‌ని పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగితే దాంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఈ మిశ్ర‌మంలో ఉండ‌డం వ‌ల్ల రోగాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రావు. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆస్త‌మా ఉన్న‌వారికి చాలా మంచి చేస్తుంది. 


2. క‌ఫం తొల‌గిపోతుంది. ద‌గ్గు, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. 


3. నిద్రలేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారికి ఇది మంచి ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు. దీంతో రోజూ చ‌క్క‌గా నిద్ర‌పోవ‌చ్చు. 


4. మహిళలకు రుతు సమయంలో వ‌చ్చే కడుపునొప్పి, అధిక రక్తస్రావం సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 


5. హార్మోన్ల స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. జీవ‌క్రియ‌లు మెరుగ‌వుతాయి. 


6. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ ఉండ‌వు. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు న‌శిస్తాయి.

రోజు గుప్పెడు బాదాం తింటే . 



బాదం పప్పులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో పాలీఅన్‌శాచురేటెడ్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి6, బి12, మెగ్నిషియం, పొటాషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలో రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పును రోజూ తింటే దాంతో శరీరానికి చక్కని పోషణ అందడమే కాదు, పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. రోజూ గుప్పెడు నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసుకుని తింటే దాంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు. 

2. బాదం పప్పులో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల రోజూ వాటిని తింటే శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు పోతుంది. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. 

3. బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. 




4. చర్మానికి కాంతిని అందించే యాంటీ ఏజింగ్ గుణాలు బాదం పప్పులో ఉంటాయి. నిత్యం వీటిని తింటే చర్మంపై ఏర్పడే ముడతలు పోయి యవ్వనంగా తయారవుతారు. 


5. జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా పోతుంది. మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. 

6. బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ మెదడుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎదిగే పిల్లలకు చాలా మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.



                                                                                                      - seaflowdiary 







Monday, July 10, 2017


                       పొట్టను కరిగించే పవర్ ఫుల్  పిప్పళ్లు 
                                                                Date :10-07-2017





పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 



1. పిప్పళ్ల పొడిని 500 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం, రాత్రి భోజనం చేసిన తరువాత గంటకు తినాలి. దీంతో బానపొట్ట కూడా తగ్గిపోతుంది. ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు చాలా వేగంగా తగ్గుతారు. 

2. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి రోజూ తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు పోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. 
3. పిప్పళ్ల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. గుండె సమస్యలు రావు. పేగుల్లో ఉన్న పురుగులు నశిస్తాయి. 


4. పిప్పళ్ల పొడిని నిత్యం ఏదో ఒక విధంగా 500 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకున్నా చాలు. దాంతో చర్మంపై వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు రావు. ఆకలి సరిగ్గా ఉంటుంది. ఊపిరితిత్తులు, లివర్ శుభ్రమవుతాయి. 





5. పిప్పళ్ల కషాయం తాగుతుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపులు ఉండవు. 

6. పిప్పళ్ల పొడి 500 మిల్లీగ్రాములు, 1 టీస్పూన్ నెయ్యి కలిపి తింటే గ్యాస్ సమస్య పోతుంది. అజీర్తి తగ్గుతుంది. 

7. పిప్పళ్ల పొడిని రోజూ 500 మిల్లీగ్రాముల మోతాదులో రెండు సార్లు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. పైల్స్, హెమరాయిడ్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

                                                                                            - seaflowdiary 

Monday, June 26, 2017


                Wheat plant juice -గోధుమ గడ్డి జ్యూస్ 
                                                             Date : 26-06-2017






గోధుమ గడ్డి. నేటి తరుణంలో ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట ఇది. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది దీన్ని వాడడం మొదలు పెడుతున్నారు. అయితే గోధుమ గడ్డి మనకు పొడి, టాబ్లెట్ రూపంలోనూ లభిస్తున్నది. కానీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలో పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. దీన్ని నిత్యం 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. గోధుమ గడ్డిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో కొంత ఆహారం తిన్నా చాలు, ఎక్కువ సేపు వరకు ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గుతారు. అదేవిధంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి. 



2. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు. 



3. గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. 



4. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులకు గాలి సరఫరాను క్రమబద్దీకరిస్తాయి. దీంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. అలర్జీలు రావు. 


5. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్లు ఉన్న వారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది. ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

6. గోధుమగడ్డిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే దాంతో క్లోరోఫిల్ శరీరంలోకి చేరి తద్వారా రక్తం పెరుగుతుంది. అనీమియా రాకుండా ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా ఇది ఎంతగానో మేలు చేస్తుంది. 

7. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గించి మూడ్ మారుస్తాయి. 

8. గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే రక్త కణాలు ఆక్సిజన్‌ను ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో శరీరానికి ఎల్లప్పుడూ శక్తి అందుతుంది. తద్వారా యాక్టివ్‌గా ఉంటారు. 

9. క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి గోధుమ గడ్డికి ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


                                                                                                - seaflowdiary 

Sunday, June 18, 2017



                                  EAT  CASHEWNUT  -  జీడిపప్పు తింటే !
                                                                                                                   Date : 18-06-2017





జీడిపప్పును చాలా మంది వంటల్లో ఎక్కువగా వాడుతారు. దీంతో వంటలు రుచికరంగా ఉంటాయి. మంచి వాసన వస్తుంది. అయితే వంటల్లోనే కాక జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. జీడిపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ పోతాయి. మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు రోజూ జీడిపప్పు తినాలి. దీంతో ట్రిప్టోఫాన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మన శరీరంలో మూడ్‌ను నియంత్రిస్తుంది. మంచి మూడ్‌లోకి వస్తారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. 



2. రోజూ జీడిపప్పును తింటే నేత్ర సంబంధ సమస్యలు పోతాయి. దృష్టి బాగా ఉంటుంది. గ్లకోమా, శుక్లాల సమస్య రాదు. 



3. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. 



4. శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది బరువును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. రోజూ జీడిపప్పును తింటుంటే నెల రోజుల్లో 30 శాతం వరకు బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. 



5. గుండె జబ్బులు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. 



6. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను రాకుండా చూస్తుంది. 



7. మన శరీరానికి అవసరం అయ్యే చాలా విటిమన్లు, మినరల్స్ జీడిపప్పు ద్వారా లభిస్తాయి. దీంతో హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి.
                                                                                                  - seaflowdiary 


Friday, June 16, 2017



   Thyroid problems - ఈ ఆహారం తింటే థైరాయిడ్ సమస్య ఉండదు !
                                                           Date : 16-06-2017




ప్రపంచ వ్యాప్తంగా నేడు చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. హైపో, హైపర్ థైరాయిడిజం అని థైరాయిడ్ సమస్యలో 2 రకాలు ఉన్నాయి. వీటి వల్ల వేర్వేరు రకాలుగా మనకు అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ థైరాయిడ్ సమస్య అయినా కచ్చితమైన ఆహారం తీసుకుంటే తద్వారా దాన్నుంచి బయట పడవచ్చు. మనం తీసుకునే ఆహారం మెటబాలిజంను ప్రభావితం చేస్తుంది. కనుక అలాంటి ఆహారం తింటే తద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. పెరుగు





పెరుగులో విటమిన్ డి, ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను పెంపొందిస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అసమతుల్యతలు తగ్గిపోతాయి. 


2. చేపలు



చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు. ఇవి శరీర మెటబాలిజంను క్రమబద్దీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. 


3. ఆలివ్ ఆయిల్


ఆలివ్ ఆయిల్‌లో మన శరీరానికి కావల్సిన డైటరీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. 

4. గ్రీన్ టీ


గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వు కణాలను బయటకు విడుదల చేస్తాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. అలా విడుదలయ్యే కొవ్వును లివర్ శక్తిగా మారుస్తుంది. దీంతో మెటబాలిజం క్రమబద్దీకరించబడుతుంది. అలా థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. 

5. కోడిగుడ్లు


మన శరీర మెటబాలిజంను రెగ్యులరైజ్ చేసే ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు కోడిగుడ్లలో ఉంటాయి. కనుక కోడిగుడ్లను తరచూ తింటుండం వల్ల కూడా మెటబాలిజంను సరైన స్థాయిలో ఉంచుకోవచ్చు. దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది.

6. అయోడిన్ ఉన్న ఆహారం


అయోడిన్ ఎక్కువగా ఉన్న చేపలు, రొయ్యలు, పాలకూర, వెల్లుల్లి, నువ్వులు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో శరీరానికి అయోడిన్ అందుతుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో ఆ సమస్య దూరమవుతుంది. 

7. సెలీనియం, జింక్


పుట్ట గొడుగులు, మాంసం, పొద్దు తిరుగుడు విత్తనాలు, సోయా బీన్, పచ్చి బటానీలు, వాల్‌నట్స్, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, బాదం పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల సెలీనియం, జింక్ మన శరీరానికి అందుతాయి. తద్వారా థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. దీంతో థైరాయిడ్ సమస్య పోతుంది. 

                                                                                                    --seaflowdiary 




Sunday, June 11, 2017



         మధుమేహం - జీర్ణ సమస్యలు - ఇన్ఫెక్షన్ లకు లవంగాలు 
                                                                           Date : 11-06-2017



ల‌వంగాలు... మ‌నం వీటిని వంట‌ల్లో ఎక్కువగా ఉప‌యోగిస్తాం. వీటి వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అవి చాలా ఘాటుగా కూడా ఉంటాయి. అయితే కేవ‌లం వంటలే కాదు, ల‌వంగాల వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా అనేక లాభాలు క‌లుగుతాయి. వీటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


1. ల‌వంగాల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇవి నోటి దుర్వాస‌న‌ను పోగొడ‌తాయి. దంతాల‌ను, చిగుళ్ల‌ను దృఢంగా చేస్తాయి. దంత స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. రోజూ భోజ‌నం చేసిన మూడు పూటలా పూట‌కో ల‌వంగాన్ని నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి. దంతాల నొప్పి ఉన్న వారు ల‌వంగాల‌ను ఇలా తింటే ఫ‌లితం ఉంటుంది. 



2. వాంతులు, వికారం వంటి ల‌క్ష‌ణాల‌ను ల‌వంగాలు త‌గ్గిస్తాయి. ల‌వంగాల‌కు కొద్దిగా తేనె క‌లిపి తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. 



3. ఆహారం స‌రిగ్గా జీర్ణం కాని వారు భోజ‌నం చేయ‌గానే ఓ ల‌వంగం నోట్లో వేసుకుని న‌మిలితే చాలు. ఆహారం వెంట‌నే జీర్ణ‌మ‌వుతుంది. దీంతోపాటు గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. 



4. ఒక గ్లాస్ నీటిని పాత్ర‌లో పోసి అందులో ల‌వంగాలు వేసి బాగా మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిని వేడిగా ఉన్న‌ప్పుడే తాగేయాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు పోతాయి. ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించినా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. 



5. మ‌ధుమేహం ఉన్న వారు ల‌వంగాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. 3 పూట‌లా భోజ‌నం చేయ‌గానే 1, 2 ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి ఆ ర‌సాన్ని మింగేయాలి. దీంతో ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు వెంట‌నే అదుపులోకి వ‌చ్చేస్తాయి. ఇలా ప్ర‌తి రోజూ చేస్తే మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. 

cloves 

6. ల‌వంగాల్లో ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు రావు. ముఖ్యంగా ఈ కాలంలో వ‌చ్చే వైర‌ల్ జ్వ‌రాల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. 



7. లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అందువ‌ల్ల ఇవి కండ‌రాలు, కీళ్ల నొప్పుల‌ను కూడా త‌గ్గిస్తాయి. ల‌వంగాల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటితో కాప‌డం పెడితే నొప్పులు త‌గ్గుతాయి. 



8. ఒక గ్లాస్ పాల‌లో 1/4 టీస్పూన్ ల‌వంగాల పొడి, రాతి ఉప్పు (రాక్ సాల్ట్‌) కలిపి తాగితే త‌లనొప్పి వెంట‌నే త‌గ్గుతుంది. 



9. ల‌వంగాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. 



10. దుర‌ద‌లు, గాయాలు, పుండ్లు అయిన చోట ల‌వంగాలు, గంధం పొడిల‌ను క‌లిపి పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే వెంట‌నే అవి త‌గ్గుతాయి. 



11. బాగా దాహం అవుతున్న‌ప్పుడు 1, 2 ల‌వంగాల‌ను నోట్లో వేసుకుని న‌మిలితే అతి దాహం స‌మస్య తీరుతుంది.
                                                                                                           - seaflowdiary 



                                    రిజిస్ట్రేషన్  -  Registration
                                                                          Date: 11-06-2017
         
రిజిస్ట్రేషన్ చేయడమంటే  ఒక వస్తువు గాని ఆస్తి గాని భూమి గాని ఇల్లు గాని ఫలానా వ్యక్తికి సంభందించినది అని తెలియజేయడానికి ఒక authorised సర్టిఫికెట్ మాత్రమే. ఒకతని ఆస్తి ఇంకొకతను కొనడానికి ప్రభుత్వానికివిలువని బట్టి డబ్బు  చెల్లించాలి. దీని వలన ప్రభుత్వానికి డబ్బు ఉచితం గా వస్తుంది ఇది మామూలు డబ్బు కాదు వేల కోట్లలో వచ్చి చేరుతుంది ,ప్రభుత్వం  డబ్బు సంపాదించడానికి ఈ ఉపాయం  కనిపెట్టింది .డబ్బు లేకుండా మామూలు అయ్యే ఖర్చు తీసికొని రిజిస్ట్రేషన్ చేయవచ్చు కదా . 
 సరే ఎదో కష్టపడి కొన్నవారు డబ్బు చెల్లిస్తారు,రిజిస్ట్రేషన్ చేసికొంటారు . రిజిస్ట్రేషన్ చేసుకున్నతరువాత అది ఇతరుల పేరు మీదికి ఎలా మారుతుంది ?
 అమాయకులు , మిడిల్ క్లాస్ వారు జీవితమంతా కష్టపడి మిగిల్చిన డబ్బుతో ల్యాండ్ కొని అలాగే ఉంచినా లేదా ఇల్లు కట్టుకొని నివసించినా కొన్ని రోజులకు ఎవరో ఒకరు వచ్చి ఇది నాదని భయపెట్టి వెడలగొట్టిన లేదా ప్రభుత్వమే ఇది ప్రభుత్వ భూమి అని కట్టుకొన్న ఇంటిని కూలగొడితే ఆ మనిషి ఎక్కడకు పోవాలి ? ప్రభుత్వమే కూల గొడితే ఏం చేయాలి ? ఒక వైపు ప్రభుత్వమే BRS అంటుంది మరొక వైపు కూలగొడుతుంది, ఏమిటీ ద్వంద వైఖరి. ప్రజలకు మేలు చేయాలి కానీ బ్రతుకులని బజారుకు ఈడ్చడం  ప్రభుత్వ విధానమా? ఇల్లు కట్టడం అంటే ఒక రోజులో జరిగే పనా లేదా రాత్రికి రాత్రికి జరిగే పనా , ఇల్లు కట్టాలంటే నెలలు పడుతుంది ఈ కాలం లో ప్రభుత్వనికి కనిపించదా ? ఏది ఏమైనా ఇల్లు కూలగొట్టడం వలన దానికి అయినా వ్యయం బూడిదలో పోసిన పన్నీరేనా ? లేదా ఏటిలో పచ్చిపులు పిసికినట్లు కాదా ? దీనిని ప్రభుత్వం ఎందుకు ఆలోచన చెయ్యదు , కావాలంటే కూలగొట్టకుండా స్వాధీనం చేసుకొని డబుల్ బెడ్ రూమ్ కట్టించే వారికి allot చేయవచ్చు,సామాన్యులను ఆదుకొనదా ? అరణ్య రోదనయేనా. 
ఇక చార్మినార్ ను కూడా ఎవరి పేరు మీదనైనా రిజిస్ట్రేషన్ చేస్తారట, రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక పద్దతి లేదా? మరి ఉంటే ఎలా చేస్తారు ? రాజులు కట్టిన చార్మినార్ లాంటి వాటిని ను ధారా దత్తం చేస్తే అతను occupy చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటుందా ?  ఇది కేవలం ఆటవిక పద్దతి మాత్రమే ! స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా మార్పు లేదు . 
భూమి అమ్మేటప్పుడు దానిని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు verify చెయ్యరా ? రెవిన్యూ శాఖలో ఎవరి పేరు మీద ఉందో అతనే అమ్ముతున్నాడా verify లేకుండా కేవలం papers చూపితే రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు . రెవెన్యూ లో కూడా గందరగోళం . చివరికి నష్టపోయేది సామాన్య మధ్య తరగతి ప్రజలే . 
మన ప్రియతమ KCR గారు గౌ. నీ . ముఖ్యమంత్రి గారు ఈ రిజిస్ట్రేషన్ ,రెవెన్యూ, మరియు మునిసిపాలిటీ  శాఖలను కూలంకషముగా ప్రక్షాళన మరియు కరప్షన్ ఒక్క పైసా కూడా లేకుండా చేసి సామాన్య మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలని కోరుదాం .తప్పకుండా న్యాయం చేస్తారు  - seaflowdiary 

Sunday, June 4, 2017



            Health is wealth-10  .... ఆరోగ్యమే మహాభాగ్యం -10
                                                                Date : 04-06-2017
                                                                                          updated : 09-06-2017,13-06-2017



మ‌న శ‌రీరంలో కిడ్నీలు ముఖ్య‌మైన అవ‌యవాలు . ఇవి శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోస్తాయి. దీంతో ర‌క్తం శుద్ధి అవుతుంది. త‌ద్వారా విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోయి మ‌న‌కు ఆరోగ్యం క‌లుగుతుంది. అయితే ఎప్పుడూ కిడ్నీలు క్లీన్‌గా ఉంటేనే అవి చ‌క్క‌గా ప‌నిచేసి మ‌న‌కు అనారోగ్యం రాకుండా చేస్తాయి. ఈ క్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ మూత్ర‌పిండాల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. అయితే కిడ్నీలు ఎప్ప‌టికీ క్లీన్‌గా ఉండాలంటే ఈ సూచ‌న‌లు పాటించాలి. అవేమిటంటే... 


1. నీళ్లు


కిడ్నీలను సులభంగా శుభ్ర‌ పరచగల సాధనాల్లో ఒక‌టి మంచి నీళ్ళు. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాస్ ల వరకు నీటిని తాగాలి. దీంతో ఆ నీళ్ళు విష‌ పదార్థాలను ఫిల్టర్ చేస్తాయి. అయితే మూత్రం గ‌న‌క దుర్వాస‌న వ‌స్తుంటే అప్పుడు ఇంకా ఎక్కువ నీరు తాగాల‌ని అర్థం. అలా తాగితే మూత్రం దుర్వాస‌న రాదు. ఫ‌లితంగా కిడ్నీలు క్లీన్ అవుతాయి

2. పండ్లు



తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజూ తీసుకోవాలి. ద్రాక్ష‌, నారింజ‌, అర‌టి పండ్లు, కివీ, అప్రికాట్ త‌దిత‌రాల్లో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో ఇవి కిడ్నీల‌ను శుభ్రం చేస్తాయి. అదేవిధంగా పాలు, పెరుగు, ప‌లు ర‌కాల బెర్రీ పండ్లు కూడా కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

3. బార్లీ



బార్లీ గింజ‌లు కిడ్నీలను బాగా శుభ్రం చేస్తాయి. నిత్యం బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీలు క్లీన్ అవుతాయి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి బాగా మ‌రిగించాలి. ఆ త‌రువాత వ‌చ్చే నీటిలో నిమ్మ‌కాయ ర‌సం పిండి తాగాలి. ఇలా రోజూ చేస్తే కిడ్నీలు క్లీన్ అవ‌డ‌మే కాదు, మూత్రాశ‌య స‌మ‌స్య‌లు, కిడ్నీ స్టోన్లు కూడా పోతాయి. దీంతో కిడ్నీల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. 



4. ఆల్కహాల్, చాకొలేట్, కెఫీన్‌


కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే మ‌ద్యం తాగ‌కూడ‌దు. చాకొలెట్‌ తిన‌కూడ‌దు. కెఫీన్ ఉన్న టీ, కాఫీ లాంటివి తాగ‌కూడ‌దు. ప‌రిమితిలో తాగితే ఓకే. లేదంటే అవి శ‌రీరంలో ఎక్కువై పోయి త‌ద్వారా కిడ్నీల పనిత‌నంపై ప్ర‌భావం చూపుతాయి. క‌నుక వీటి వైపు చూడ‌క‌పోవ‌డ‌మే మంచిది.




వెల్లుల్లిని దిండు క్రింద పెట్టుకుని నిద్రిస్తే !






వెల్లుల్లిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నోకీల‌క పోష‌కాలు ఉన్నాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. దీన్ని మ‌నం నిత్యం వంట‌కాల్లో వాడుతుంటాం. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వెల్లుల్లిని తిన‌కుండానే దాని ద్వారా కొన్ని ప్ర‌యోజ‌నాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు. అదెలాగంటే... 


ఒక వెల్లుల్లి రేకును తీసుకుని మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోండి. అంతే చాలు. దాంతో కింద చెప్పిన ఉప‌యోగాలు క‌లుగుతాయి.

1. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించ‌డం వ‌ల్ల అందులో ఉండే వేడి, అరోమా గుణాలు మెద‌డులోని ప‌లు ప్రాంతాల‌ను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. రోజూ దిండు కింద ఓ వెల్లుల్లి రేకుని పెట్టుకుని ప‌డుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వ‌స్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉండ‌దు.

2. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే చాలు. వెంట‌నే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

3. గుండె సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయి. ర‌క్తం శుభ్ర‌మ‌వుతుంది.

4. లివ‌ర్ చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. అన్ని ర‌కాల లివ‌ర్ వ్యాధులు పోతాయి.

5. వెంట్రుక‌ల‌కు పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య తొల‌గిపోతుంది.

6. హార్మ‌న్ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీవ‌క్రియ‌లు స‌క్రమంగా జ‌రుగుతాయి.



15 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గించే ఓమ  నీరు !


శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు లేదా అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం ఎంత క‌ష్ట‌మైన విష‌య‌మో అంద‌రికీ తెలిసిందే. రోజూ వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటే త‌ప్ప అధిక బ‌రువు త‌గ్గ‌దు. క‌చ్చిత‌మైన ఆహార‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే మ‌నం వంటల్లో ఎక్కువ‌గా ఉప‌యోగించే వాముతో కేవ‌లం 15 రోజుల్లోనే 5 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు తెలుసా..? అందుకు ఏం చేయాలంటే... 

ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వాము గింజ‌ల‌ను తీసుకుని రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఆ నీటితో స‌హా గింజ‌ల‌ను అలాగే ఉంచి మ‌రిగించాలి. అనంత‌రం గింజ‌ల‌ను వ‌డ‌క‌ట్టగా వ‌చ్చే నీటిని తాగాలి. ఈ నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. ఆ త‌రువాత గంట వ‌ర‌కు ఏమీ తిన‌కూడ‌దు. ఇలా రోజూ చేస్తే క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతారు. అయితే ఈ నీటిని రోజుకు 3 పూట‌లా భోజ‌నానికి గంట ముందు తీసుకుంటే దాంతో ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది. పైన చెప్పిన‌ట్టుగా త‌క్కువ రోజుల్లోనే అధికంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

మహిళలకు ఋతు క్రమం సరిగ్గా రావాలంటే !


హార్మోన్ల లోపం, స్థూల‌కాయం, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు... వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మంది మ‌హిళ‌లు నేడు అనేక రుతు సంబంధ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీంతో చాలా మందికి నెల‌స‌రి స‌రిగ్గా రావ‌డం లేదు. ఫలితంగా ఇది సంతానం కావాల‌నుకునే వారికి పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే కింద ఇచ్చిన టిప్స్ పాటిస్తే దాంతో స్త్రీలు త‌మ రుతు స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. దీంతో నెల‌స‌రి స‌రిగ్గా వ‌స్తుంది. ఈ క్ర‌మంలో సంతానం క‌లిగేందుకు అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. ఆ టిప్స్ ఏమిటంటే... 


1. బొప్పాయి పండు




బొప్పాయి పండును పూర్తిగా పండ‌క ముందే అంటే కొంచెం ప‌చ్చ‌గా, దోర‌గా ఉన్న‌ప్పుడే తినాలి. అలా తిన‌డం వ‌ల్ల మ‌హిళ‌లకు రుతు క్ర‌మం స‌రిగ్గా అవుతుంది. అయితే ఈ పండును పీరియ‌డ్స్‌లో మాత్రం తిన‌కూడ‌దు.




2. ప‌సుపు



ఒక గ్లాస్ వేడి పాల‌లో 1/4 టీస్పూన్ పసుపును క‌లుపుకుని రోజుకు ఒక‌సారి ఎప్పుడైనా తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే రుతు స‌మ‌స్య‌లు పోతాయి. రుతు క్ర‌మం స‌రిగ్గా అవుతుంది. ప‌సుపులో ఉండే ఔష‌ధ గుణాలు స్త్రీల‌కు క‌లిగే రుతు స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి.


3. అలోవెరా


రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున‌ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో అలోవెరా (క‌ల‌బంద‌) గుజ్జును తినాలి. దీంతో రుతు క్ర‌మం స‌రిగ్గా అవుతుంది. పీరియ‌డ్స్‌లో వ‌చ్చే నొప్పి త‌గ్గుతుంది. పీరియ‌డ్స్‌లో మాత్రం దీన్ని తీసుకోకూడ‌దు.

4. అల్లం


చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి 5 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే ద్ర‌వంలో చ‌క్కెర లేదా తేనె క‌లుపుకుని తాగాలి. ఇలా రోజుకు 3 పూట‌లా భోజ‌నం చేసిన వెంట‌నే తాగాలి. దీంతో రుతు స‌మ‌స్య‌లు పోతాయి. రుతు క్ర‌మం స‌రిగ్గా అవుతుంది. హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. త‌ద్వారా సంతానం క‌లిగేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది.

5. జీల‌క‌ర్ర‌


రెండు టీస్పూన్ల జీల‌క‌ర్ర‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే జీల‌క‌ర్ర‌ను తీసేసి ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీంతో రుతు స‌మ‌స్య‌లు పోతాయి. ఇలా రెగ్యుల‌ర్‌గా తాగితే ఫ‌లితం ఉంటుంది.


6. దాల్చిన చెక్క‌


ఒక గ్లాస్ వేడి పాల‌లో 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి బాగా క‌లిపి తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే కొద్ది రోజుల‌కు పీరియ‌డ్స్ స‌క్ర‌మంగా వ‌స్తాయి. రుతు స‌మ‌స్య‌లు పోతాయి.


7. ప్రాణాయామం


పైన చెప్పిన చిట్కాల‌తోపాటు క‌పాల‌భత్తి అనే ప్ర‌త్యేక‌మైన ప్రాణాయామ ప‌ద్ధ‌తిని పాటిస్తే రుతు స‌మ‌స్య‌లు పోతాయి. పీరియ‌డ్స్ స‌క్రమంగా వ‌స్తాయి. దీన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున పాటించాలి. గాలిని వేగంగా లోప‌లికి పీలుస్తూ వ‌దులుతూ 5 నిమిషాల పాటు చేయాలి. దీన్ని ఒక ఆవృతం అంటారు. అలాంటి ఆవృతాలు 3 చేస్తే చాలు. అంటే 15 నిమిషాల పాటు దీన్ని రోజూ చేయాలి. 5 నిమిషాల‌కు ఒక‌సారి గ్యాప్ ఇవ్వాలి. ఈ క‌పాలభ‌త్తి ప్రాణాయామం చేస్తే రుతు స‌మ‌స్య‌లే కాదు, ఇంకా అనేక స‌మ‌స్య‌లు పోతాయి. అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయి.

మొలకెత్తిన గిగింజలను ఎప్పుడు తినాలి 


మొల‌కెత్తిన గింజ‌లను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కీల‌క పోష‌కాలను అందించ‌డంలో ఇవి ప్ర‌ముఖ పాత్ర వహిస్తాయి. దీంతోపాటు జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. విట‌మిన్ ఎ, బి6, సి, కె, ఫైబ‌ర్‌, మాంగ‌నీస్‌, రైబో ఫ్లేవిన్‌, కాప‌ర్, థ‌యామిన్‌, నియాసిన్‌, పాంటోథెనిక్ యాసిడ్‌, ఐర‌న్‌, మెగ్నిషియం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పోష‌కాలు మ‌న‌కు అందుతాయి. అయితే మొల‌కెత్తిన గింజ‌ల‌ను చాలా మంది ఎప్పుడు ప‌డితే అప్పుడే తింటారు. కానీ అలా కాదు, వాటిని కూడా నిర్దిష్ట‌మైన స‌మ‌యంలోనే తినాలి. ఆ స‌మ‌యం ఏదంటే... 

మొల‌కెత్తిన గింజ‌ల‌ను ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందుగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే వాటి వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. ఎందుకంటే ఉద‌యం పూట శ‌రీరానికి శ‌క్తి చాలా అవ‌స‌రం. ఈ క్ర‌మంలో వాటిని తింటే త‌గినంత శ‌క్తి ల‌భించ‌డ‌మే కాదు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చక్క‌ని ప‌రిష్కారం ల‌భిస్తుంది. అలా కాకుండా సాయంత్రం, రాత్రి పూట తింటే మొల‌కెత్తిన గింజ‌ల్లో ఉండే ప‌దార్థాలు స‌రిగ్గా జీర్ణం కావు. దీంతో మ‌న‌కు పోష‌ణ స‌రిగ్గా ల‌భించ‌దు. క‌నుక వాటిని ఉద‌యాన్నే తిన‌డం అల‌వాటు చేసుకుంటే గరిష్టంగా ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు..!

                                                                                                                     - seaflowdiary